Cm Chandrababu IAS Krishna Teja Idea: అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర చర్చ జరిగింది. పట్టణాల సమీపంలోని పంచాయతీల అభివృద్ధి, ప్రణాళికలపై దృష్టి సారించారు. పంచాయతీలకు కొత్త గ్రేడింగ్ విధానం, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. రాష్ట్రంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించారు. పరిశుభ్రతపై ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యర్థాల నిర్వహణకు కొత్త విధానాలు అమలు చేయనున్నారు.