తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవి.. వెల్లేల ప్రహ్లాద్ అనే అమాయకుడి డాక్యుమెంట్లను దొంగిలించి.. నకిలీ గుర్తింపుతో పైరసీ సామ్రాజ్యాన్ని నడిపినట్లు తేలింది. అంతకుముందు ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని.. అతడి డాక్యుమెంట్లు తాను తీసుకున్నట్లు విచారణలో ఐబొమ్మ రవి వెల్లడించాడు. దీనిపై ప్రహ్లాద్ను పోలీసులు విచారించగా.. అసలు రవి ఎవరో తనకు తెలియదని.. తన పేరుతో రవి అక్రమాలకు పాల్పడ్డాడని షాకింగ్ విషయాలు వెల్లడించాడు.