ఐబొమ్మ రవి పైరసీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసందే. అతడి పైరసీ సామ్రాజ్యాన్ని ఛేదించడంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవి పైరసీ గురించి సైబర్క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గత ఆరేళ్లలో రవి రూ. కోట్ల అక్రమ సంపద కూడబెట్టిన తెలిపారు. రవి.. వెబ్సైట్లను 'ఎన్జల' కంపెనీ నుంచి హోస్ట్ చేసినట్లు చెప్పారు. గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లకు రీడైరెక్ట్ చేస్తూ.. రూ. 20 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నారు. అయితే అతడు పోలీసులకు పట్టుబడటంలో అతడి భార్య పాత్ర లేదని స్పష్టం చేశారు.