భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి సహాయం కోసం ప్రత్యేక నెంబర్లను అందుబాటులో ఉంచింది. మరోవైపు, దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ సైనికుడు మురళి నాయక్కు చంద్రబాబు నివాళులర్పించారు. రాష్ట్రంలో భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.