మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టం అమలుపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. భూ భారతి చట్టంపై అవగాహన కోసం 28 జిల్లాల్లో వర్క్షాపులను నిర్వహిస్తారు. ఇళ్ల నిర్మాణం 400-600 చ.అడుగుల మధ్య ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి త్వరలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు.