కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించాలని చంద్రబాబు కోరారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయాలని, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల గురించి చర్చించాలని విజ్ఞప్తి చేశారు. మామిడి గుజ్జుపై జీఎస్టీని తగ్గించాలని కోరారు. గుంటూరులో పొగాకు బోర్డు అధికారులతో పీయూష్ గోయల్ సమావేశమై, రైతుల సమస్యలపై చర్చించారు. పొగాకు రైతుల పిల్లల చదువుల కోసం వడ్డీ లేని రుణాల గడువును పెంచాలని నిర్ణయించారు.