విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 మహాప్రదర్శనకు సాగరతీరం ముస్తాబైంది. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది యోగాసనాలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. బీచ్ పొడవునా 3.26 లక్షల మంది పాల్గొనేలా 29 కి.మీ. మేర 326 కంపార్ట్మెంట్లు ఏర్పాటుచేశారు.