IPS Raghuveer Reddy: 2024 ఏపీ ఎన్నికల వేళ జరిగిన అల్లు అర్జున్ నంద్యాల టూర్ ఘటన ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో నంద్యాల ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి రఘువీర్రెడ్డిపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్గా ఉన్న రఘువీర్రెడ్డిపై విచారణ జరిపేందుకు అధికారిని నియమించింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ చేసి.. దానిపై రిపోర్టు ఇవ్వాలని విచారణ అధికారికి ఇచ్చిన ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.