IPS Ranganath: హైడ్రా నెక్స్ట్ టార్గెట్.. మల్లారెడ్డి అడ్డాలో అక్రమ కట్టడాలు పరిశీలించిన రంగనాథ్

1 year ago 39
IPS Ranganath: హైదరాబాద్‌ నగరంలో గత కొన్ని రోజులుగా హైడ్రా పేరు మారుమోగిపోతోంది. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్న ఈ హైడ్రా అధికారులు.. నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చి వేయడంతో అందరి చూపు హైడ్రా వైపు మళ్లింది. ఈ క్రమంలోనే తర్వాత ఎవరి మీద హైడ్రా కన్ను పడుతుందోనని.. అక్రమ కట్టడాలు కట్టిన వారిలో భయం నెలకొంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాఖాలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. పర్యటించడంతో నెక్స్ట్ టార్గెట్ అక్కడేనా అనే చర్చ జరుగుతోంది.
Read Entire Article