ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, కడప ఎస్పీగా నచికేత్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.