హోటళ్లలో తిండి తినాలంటే జనాలు జంకుతున్నారు. ఇప్పటికే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆహార పదార్థాల్లో బల్లులు, జెర్రీలు వస్తుండటం ఇప్పుడు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్లోని ఓ ఫేమస్ హోటల్లో పప్పులో జెర్రీ కనిపించగా.. ఇప్పుడు జగిత్యాలలోని ఓ పేరు మోసిన టిఫిన్ సెంటర్లోనూ ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.