Railway Kodur Mla Arava Sreedhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై అత్యాచారం ఆరోపణలు కలకలం రేపాయి. జనసేన పార్టీ ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఎమ్మెల్యే వారం రోజుల్లోగా కమిటీ ముందు హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. ఇటు ఏపీ మహిళా కమిషన్ కూడా ఈ ఆరోపణలపై స్పందించి, సమగ్ర విచారణకు హామీ ఇచ్చింది. ఎమ్మెల్యే మాత్రం తనపై దుష్ప్రచారం జరుగుతోంది అంటున్నారు.