Janasena Party: పిఠాపురం మొత్తం జనసైనికులతో నిండిపోయింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న జనసైనికులు మొత్తం ఇప్పుడు పిఠాపురం చేరుకుంటున్నారు. మరికాసేపట్లో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయకేతనం సభ ప్రారంభం కానుంది. జనసేన కార్యకర్తలు భారీగా వస్తుండటంతో.. సభా ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.