అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. జనసేన పార్టీకి చెందిన నేత తిరిగి వైసీపీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో గెలుపొంది ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నుంచి పలువురు నేతలు కూటమి పార్టీల్లో చేరిపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మొదలుకొని ద్వితీయ స్థాయి నాయకత్వం సైతం చాలాచోట్ల వైసీపీకి గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా మునగపాక మండల ఎంపీపీ జయలక్ష్మి వైసీపీని వీడి జనసేనలో చేరారు. అయితే తాజాగా ఆమె మళ్లీ తిరిగి వైసీపీ గూటికి చేరారు.