తిరుపతికి చెందిన సూక్ష్మ కళాకారుడు పల్లి చిరంజీవి, ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు నివాళిగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమతో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని మురళీ నాయక్ తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించడం కోసం వేసినట్టు చిరంజీవి తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులకు అందజేయనున్నారు. పల్లి చిరంజీవి బియ్యపు గింజలపై పహల్గాం ఉగ్రదాడితో పాటు పలు సూక్ష్మ కళాఖండాలను రూపొందించారు.