హైదరాబాద్ మెట్రో విస్తరణపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మెట్రో విస్తరణకు 'ఏ' భాగంలో 76.4 కి.మీ. (రూ.24,269 కోట్లు) కేంద్ర పరిశీలనలో ఉండగా.. 'బి' భాగంలో 86.1 కి.మీ. (రూ.19,579 కోట్లు) డీపీఆర్లకు రేపు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇందులో జేబీఎస్-శామీర్పేట, జేబీఎస్-మేడ్చల్, శంషాబాద్ విమానాశ్రయం- ఫోర్త్సిటీమార్గాలు ఉన్నాయి. ఈ విస్తరణతో ట్రాఫిక్ తగ్గి, ప్రజా రవాణా బలోపేతం అవుతుంది.