K Kavitha BRS: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత తనపై కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్రలకు తెరలేపారని అన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా.. ఆ తర్వాత తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో పని చేశానని బీసీల కోసం మహిళలకు రూ.2500 ఇవ్వాలని ఉద్యమం చేశానని ఆమె తెలిపారు. తనపై కుట్రలకు ప్రధాన కారణం హరీష్ రావే అని విమర్శించారు.