భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతలకు తెరపడింది. గత కొన్నిరోజులుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్ స్టాప్ పడింది. భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కాల్పుల విరమణకు అంగీకరించడం శుభపరిణామమని అన్నారు. నిన్నటి వరకూ ఈ విషయంలో జోక్యం చేసుకోమని అమెరికా చెప్పిందని.. అయితే ప్రార్థనలు ఫలించి.. భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అన్నారు.