Five Students Drown in Mallapalle Cheruvu: కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాకపోవటంతో వారి తల్లిదండ్రులు.. చెరువు గట్టు వద్దకు వెళ్లారు. అక్కడ బాలురకు సంబంధించిన దుస్తులు కనిపించాయి. దీంతో బాలురు చెరువులో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.