రోజూలాగే స్కూల్కు బయలుదేరింది పదో తరగతి విద్యార్థిని. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు బాగానే ఉన్న ఆ విద్యార్థిని.. పాఠశాల చేరుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చింది. ఆ వెంటనే స్పృహ కోల్పోయి రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఉపాధ్యాయుడు చూసి ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. పదో తరగతిలో గుండెపోటుకు గురై విద్యార్థిని మరణించటంతో అటు కుటుంబంతో పాటు ఇటు పాఠశాల, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.