టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్కు కేంద్రంలో కీలక పదవి లభించింది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సుప్రీంకోర్టులో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్ను కేంద్రం తాజాగా నియమించింది. దవీందర్పాల్ సింగ్ను, కనకమేడల రవీంద్ర కుమార్ను అదనపు సొలిసిటర్ జనరల్గా నియమిస్తూ న్యాయశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.