హైదరాబాద్లో సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీపీ సజ్జనార్ వెల్లడించారు. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కేబీఆర్ పార్కు చుట్టూ రానున్న 2 ఏళ్లలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్పాస్లు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా రాత్రివేళల్లో పనులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.