KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం ఖాయమని తేల్చి చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తప్పకుండా బైపోల్స్ వస్తాయని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఆ ఉపఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తథ్యమని కేసీఆర్ గంటా పథంగా చెప్పారు.