Konda Surekha: మంత్రి కొండా సురేఖ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై త్వరలోనే విచారణ జరుపుతామని తెలిపారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో దేవాదాయ శాఖ భూములు కబ్జాలకు గురయ్యాయని కొండా సురేఖ తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే మళ్లీ నిర్వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు.