Bhadradri Kothagudem Airport: వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు విమానాశ్రయానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే మరో భారీ శుభవార్త వినిపించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఆదివారం (మార్చి 2న) రోజున హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇక.. మిగతా పనంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు.