Kukatpally : నమ్మకంగా ఉంటూనే దెబ్బేశాడు.. రూ.10 కోట్ల బంగారంతో పరార్

10 months ago 21
kukatpally: కూకట్‌పల్లిలో భారీ మోసం వెలుగుచూసింది. నితీష్ జైన్ అనే వ్యక్తి 15 ఏళ్లుగా.. చేతన్ జ్యూవెలర్స్ పేరుతో వ్యాపారం చేస్తూ.. నమ్మకంగా ఉంటూ భారీ దెబ్బేశాడు. సుమారు 10 కోట్ల రూపాయల విలువైన బంగారంతో ఉడాయించాడు. బాచుపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. నితీష్.. స్కీమ్‌లు, బంగారం తాకట్టుపెట్టుకుని వడ్డీకి ఇవ్వడం వంటివి చేసేవాడని బాధితులు తెలిపారు.
Read Entire Article