Kuppam Woman: మహిళ భర్త ఏమయ్యాడు.. అసలు ఏం జరిగిందో చెప్పిన డీఎస్పీ

6 hours ago 2
కుప్పంలో జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదంటూ ఓ మహిళను కొంతమంది చెట్టుకు కట్టేశారు. బాధిత మహిళ కొడుకు ఏడుస్తున్నా పట్టించుకోకుండా చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ ఘటన సంచలనం రేపింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో కుప్పం డీఎస్పీ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధిత మహిళ భర్త ఏమయ్యారనే వివరాలను వెల్లడించారు. మరోవైపు బాధిత మహిళను ఫోన్ ద్వారా పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఆమె కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.
Read Entire Article