గత కేసీఆర్ ప్రభుత్వం సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించడానికి కార్యక్రమం చేపట్టింది. లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారు. అయితే.. ఇంకా కొంతమంది భూముల క్రమబద్ధీకరణ జరగాల్సి ఉంది. పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులను ఆర్డీవో పరిశీలిస్తారని.. అర్హులైన వారికి త్వరలోనే పాస్ పుస్తకాలు అందజేస్తారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తోంది . అంతే కాదు.. ప్రతీ రైతుకు భూధార్ కార్డుల కూడా జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.