మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. 99 రూపాయలకు అమ్మే బ్రాండ్, బీర్ మినహా మిగతా అన్ని కేటగిరిల్లోనూ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం, విదేశీ మద్యం బ్రాండ్లపై అదనపు ఏఈఆర్టీ వసూలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఇటీవల రిటైల్ విక్రయాలపై మార్జిన్ను ఏపీ ప్రభుత్వం 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే.