ఏపీలో వంట గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని.. అనవసరంగా పానిక్ బుకింగ్స్ చేయవద్దని కోరారు. అలాగే పట్టణాల్లో పీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా ఓటీపీ ద్వారానే డెలివరీ ఉంటుందని నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు.