ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాజమహేంద్రవరంలో పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. డాక్టర్లు పరిశీలించిన అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఇటీవల సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ జరగ్గా.. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం కోలుకున్నారు. అయితే మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన సంగతి తెలిసిందే.