తెలంగాణలో మద్యం విక్రయాలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల్లో రాష్ట్రంలో సగటున ప్రతి నిమిషానికి 5,200 బీర్, ఐఎంఎఫ్ఎల్ బాటిళ్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ 4 నెలల కాలంలో సుమారు 3.5 కోట్ల కేసుల విక్రయాలతో రూ.14,668 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. వేసవి కాలంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండగా.. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అవి తగ్గినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది.