గత ఏడాది కాలంలో నమోదైన కేసుల్లో 88.56 శాతం కేసులను పరిష్కరించినట్లు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వెల్లడించారు. న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విలువలు, ప్రజాసేవ, న్యాయాన్ని వేగంగా అందించాల్సిన బాధ్యతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త హైకోర్టు భవన సముదాయం జోన్-2 నిర్మాణ పురోగతితో పాటు పాఠశాల ఉపాధ్యాయులకు బాలల చట్టాలపై శిక్షణ, బాలికల హక్కులపై అవగాహన కార్యక్రమాలను వివరించారు. టెక్నాలజీ అనుసంధానంతో న్యాయ సేవలు మరింత డిజిటల్గా మారుతున్నాయని వెల్లడించారు.