తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) గడువును మే 3 వరకు పొడిగిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం రాయితీతో అమల్లో ఉన్న ఈ పథకానికి ఇదివరకే రెండుసార్లు గడువు పెంచారు. 2020లో ప్రకటించిన ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన 25.67 లక్షల దరఖాస్తుల్లో ఇంకా పరిష్కారం కాని వాటి కోసం ఓటీఎస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 8 లక్షల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి.