ఆంధ్రప్రదేశ్లో భారీ చోరీ జరిగింది. మచిలీపట్నంలో బుధవారం భారీ దొంగతనం చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ ఘటనలో 50 తులాల బంగారం దోచుకెళ్లారు. అలాగే లక్షా 40 వేల రూపాయల నగదు కూడా చోరీకి గురైందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఉదయం వెళ్లేటప్పుడు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లాలని.. తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని బాధితురాలు మార్గరెట్ చెప్తున్నారు. బంగారం చోరీ ఘటనపై మచిలీపట్నం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.