Mahesh Babu Case: మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. నోటీసుల ప్రకారం రేపు ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమ లావాదేవీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు ఈడీ ఆయన్ను విచారించనుంది.