విద్యార్థులకు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఇక ఆ సమస్య నుంచి విముక్తి లభించినట్లే. మీ సేవా కేంద్రాల్లో ఇక నుంచి రెండో సారి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండో సారి కూడా మీ సేవా నుంచి సర్టిఫికేట్లను ప్రింట్ తీసుకోవచ్చు. ఈ మేరకు మీ సేవా ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.