బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే 15 రోజులు గడిచినా మండలి ఛైర్మన్ ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై పునరాలోచించాలని సూచించానని ఛైర్మన్ గుత్తా తెలిపారు.