తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తొలుత MPTC, ZPTC ఎన్నికలు, ఆపై సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో కీలక కామెంట్స్ చేశారు. ఇక మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.