నిర్మల్ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడులు కలకలం రేపాయి. భూమి సర్వే కోసం ఒక రైతు నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ బాలకృష్ణ, అతని అనుచరుడు నాగరాజ్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు రూ.5 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ బృందం నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుంది. నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.