భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో జరిగిన పాక్ కాల్పుల్లో ఓ తెలుగు జవాన్ వీర మరణం పొందాడు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలో కన్నుమూశాడు. మురళీ నాయక్ మరణంతో స్వగ్రామంలో విషాదం నిండింది. తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వీర జవాన్ ఈ దంపతుల ఏకైక సంతానం. తన కుమారుడి గురించి తండ్రి శ్రీరామ్ నాయక్ కీలక విషయాలను వెల్లడించారు.