Mylavaram tragedy: ఓ అసమర్థ తండ్రి చివరి మాటలు..

12 hours ago 1
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తాళం వేసిన ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. లక్ష్మీ హిరణ్య, లీలాసాయి అనే ఇద్దరు పిల్లలు మంచం మీద విగతజీవులై కనిపించారు. తల్లి చంద్రిక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. తండ్రి రవిశంకర్ కనిపించకుండా పోయారు. చిన్నారుల మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రవిశంకర్ సూసైడ్ లెటర్ రాసి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. ఏదీ సాధించలేకపోయా.. అందుకే చనిపోతున్నా, నా పిల్లలుగా పుట్టినందుకు వీరు కూడా బలికాక తప్పదు అంటూ రవిశంకర్ లెటర్ రాసినట్లు తెలిసింది. రవిశంకర్ కోసం గాలిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో చిన్నారుల తల్లి చంద్రిక విలపించిన తీరు చూపరులకు సైతం కన్నీరు తెప్పించింది.
Read Entire Article