Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు మన మిత్ర వాట్సాప్ సర్వీసుల కింద అందిస్తున్న సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా 161 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా ఏపీ ప్రజలు అందుకోగా.. తాజాగా వాటిని 200 కు పెంచినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రజలకు మరింత పారదర్శకంగా ప్రభుత్వ సర్వీసులను అందించేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.