కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడం.. పెద్ద ఎత్తున ఉద్యమించటంతో దేవనహళ్లిలో భూసేకరణ నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. అయితే ఇదే సమయంలో నారా లోకేష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. తమ వద్ద అత్యుత్తమ ప్రోత్సాహకాలు, భూమి అందుబాటులో ఉందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.