కడపలో జరిగిన టీడీపీ మహానాడులో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తల్లులను అవమానించిన వారు, తల్లిని, చెల్లిని గెంటేసిన వారి పరిస్థితి ఏమిటో చూశారా అంటూ వైసీపీని ఉద్దేశించి విమర్శించారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనను గుర్తు చేశారు. తెలుగు ప్రజల కోసం టీడీపీ చేస్తున్న పోరాటాలను వివరించారు. ఆరు కీలక శాసనాలను ప్రతిపాదించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని లోకేష్ అన్నారు.