ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు ఎయిర్పోర్టులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో ఏడు ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో నాలుగు ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం, దగదర్తి విమనాశ్రయాలను తొలి దశలో పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రంలో త్వరలోనే ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.