తెలంగాణలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. కొత్తగా 31,084 కుటుంబాలు అర్హత సాధించగా.. అప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కొత్తగా మరో 10 లక్షలకు పైగా పేర్లను చేర్చారు. వాటిలో అర్హులను గుర్తించిన ప్రభుత్వం.. కొత్త పేర్లను కూడా డైనమిక్ కీ రిజిస్టర్ లో చేర్చింది. దీంతో కొత్తగా 11.05 లక్షల మంది మే నుండి ఉచిత సన్నబియ్యం పొందనున్నారు. ఇందుకోసం అదనంగా 4,431 టన్నుల బియ్యం కోటా పెంచారు. పెళ్లి చేసుకున్న వారికి ఒకే కార్డు జారీ చేస్తున్నారు. మీసేవలో ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.