ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. మే 8 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నెలరోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు విధానంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులను ఒంటరి వాళ్లకు, లింగమార్పిడి చేయించుకున్నవాళ్లకు కూడా అందించనున్నారు.