మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 511 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెస్తామన్నారు. మన్యంకొండ గేట్ వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా.. మినీ ట్యాంక్ బండ్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు.. 144 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.