భాగ్యనగరంలో వాహనాల వినియోగం పెరుగుతుండటంతో.. కాలుష్యం అధికమవుతోంది. పీయూసీ సర్టిఫికెట్లు లేని వాహనాలపై కఠినంగా వ్యవహరించేందుకు రవాణా శాఖ సిద్దమవుతోంది. సీసీ కెమెరాల సహకారంతో వాహనాల నంబర్ప్లేట్లను పరిశీలించి, చలాన్లు జారీ చేయనున్నారు. పీయూసీ సర్టిఫికెట్ల ఆధారంగా ఈ-చలాన్లు జారీకి సిద్ధంగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎలా అయితే చలాన్లు జారీ చేస్తారో.. ఆ విధంగానే పొల్యుషన్ సర్టిఫికేట్ లేకుంటే కూడా ఈ చలాన్లు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.